పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గోరంట్ల మండలం పులేరు పంచాయతీ టీడీపీ నాయకులు నరేష్ ఆధ్వర్యంలో శనివారం 14 కుటుంబాలు, రొద్దం మండలం కలిపి పంచాయతీ ఎస్సీ కాలనీ నుండి టీడీపీ యువ నాయకులు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో 25 కుటుంబాలు, పరిగి బిందునగర్ నుండి యల్ ఐ సి రామాంజనేయులు వైసీపీ నుండి టీడీపీ లోకి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో చేరారు. పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.