నీటి సమస్యతో పెనుకొండ బాబయ్య దర్గా

74చూసినవారు
నీటి సమస్యతో పెనుకొండ బాబయ్య దర్గా
అత్యంత ప్రముఖ దర్గాలలో పెనుకొండ దర్గా ఒకటి. ఇక్కడ ప్రతి గురువారం, శుక్రవారం, అమావాస్య రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువ. ఇక్కడ ప్రధాన సమస్య నీటి సమస్య. ఎక్కడి నుండో వచ్చే భక్తులకు కనీసం కాళ్ళు కడుక్కుని స్వామి దర్శనం కావాలన్న కూడా నీళ్లు రావడం లేదు. దీనితో బయట వాటర్ బాటిల్స్, వాటర్ పాకెట్స్ కే దిక్కు అయ్యాయి. కనీసం దర్గా కమిటీ, మునిసిపల్ సిబ్బంది స్పందించి నీటి సమస్య లేకుండా చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్