ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిన సమయంలో కొత్త చెరువులో విప్లవం చెలరేగిందని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం రాత్రి కొత్తచెరువులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావును బర్తరఫ్ చేసిన సమయంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కొత్తచెరువులో విప్లవం చెలరేగిందని ఆయన పేర్కొన్నారు.