రాప్తాడు: రైతులకు ట్రాన్స్ఫర్మర్లు అందజేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

81చూసినవారు
రాప్తాడు: రైతులకు ట్రాన్స్ఫర్మర్లు అందజేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
వ్యవసాయంలో రైతులకు కరెంటు కష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గత కొన్ని రోజులుగా ట్రాన్స్ ఫార్మర్ల కోసం నిరీక్షిస్తున్న రైతులకు ఎమ్మెల్యే సునీత చొరవతో ట్రాన్స్ ఫార్మర్లు మంజూరయ్యాయి. చెన్నేకొత్తపల్లి మండలానికి 33, కనగానపల్లి మండలానికి 27 ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు కాగా వాటిని ఆదివారం ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్