విద్యార్థులకు కంటి పరీక్షలు

79చూసినవారు
విద్యార్థులకు కంటి పరీక్షలు
రాప్తాడు నియోజకవర్గం సీకేపల్లి మండలంలోని కనుముక్కల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు.. శనివారం ఒప్తాలామిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దృష్టి దోషం, కళ్ళల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్న వాటిని పరీక్షించి తగిన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్తాలమిక్ సికిందర్, సిహెచ్ఓ సౌందర్య, హెచ్ ఏ శ్రీనివాసులు, ఏఎన్ఎం సునీత, ఆశ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్