పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

80చూసినవారు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
చెన్నే కొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలోనాగేంద్ర అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడు. బోయ సంజన్న కుమారుడు నాగేంద్ర కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు.ఆదివారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డ తర్వాత, తీవ్ర మనస్థాపనతో నాగేంద్ర సోమవారం పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు పరిస్థితిని గుర్తించి,చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్