పండమేరు వాగును పరిశీలించిన ఎమ్మెల్యే

55చూసినవారు
పండమేరు వాగును పరిశీలించిన ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గకేంద్రానికి సమీపంలోని పండమేరు వాగును ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. రాప్తాడు అనంతపురం వెళ్లే రహదారి కోతకు గురికావడంతో ప్రతి రోజు నగరంలోకి వచ్చి వెళ్లే ఉద్యోగులు, చేతివృత్తుల పనివారు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాత్కాలికంగా రహదారిని ఏర్పాటు చేసి, అధికారులతో మాట్లాడి వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్