మేధా ప్రవేట్ పాఠశాల పుస్తకాల గది సీజ్: ఎంఇఓ

1539చూసినవారు
బొమ్మనహాళ్ మండలంలోని ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న మేధా ప్రైవేట్ పాఠశాలపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు, బ్యాగులు అమ్ముతుండడంపై ఎంఈఓ లకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న ఎంఈఓ లు వీరన్న, మల్లికార్జున అక్రమంగా పుస్తకాలు బ్యాగులు విక్రయిస్తున్న రూములను గురువారం సీజ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివ, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్