గార్లదిన్నె: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

58చూసినవారు
గార్లదిన్నె: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో రాముడు (45) మృతి చెందగా, సుధాకర్ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పామిడి మండలం కండ్లపల్లికి చెందిన వీరిద్దరు ద్విచక్ర వాహనంపై గార్లదిన్నె నుంచి సొంత గ్రామానికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాముడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్