చికిత్స పొందుతూ వివాహిత మృతి

61చూసినవారు
చికిత్స పొందుతూ వివాహిత మృతి
గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చెందిన శోభ(22)కు కోటం కకు చెందిన చిదానందతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు పుట్టకపోవడంతో అత్త నాగలక్ష్మి, భర్త ఆమెను వేధిస్తుండేవారు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక బుధవారం విషద్రావకం తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందింది.

సంబంధిత పోస్ట్