ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

65చూసినవారు
ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శింగనమల స్థానిక పోలీసు స్టేషన్ ను గురువారం ఆయన అకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని వాగులు, వంకల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని. తరచూ కేసు నమోదు చేస్తున్నా ఇసుకను తరలించడం మానలేదని తెలిపారు. ఇక నుంచి ఇసుకను తరలిస్తే వాహనాలు సీజ్ చేసి ఆయా యజమానులపైన కేసులు నమోదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్