వచ్చే ఎన్నికల్లో శింగనమల అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వీరాంజనేయులును
వైసీపీ బరిలో దించింది. అయితే టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇవ్వడంపై
టీడీపీ అధినేత చంద్రబాబు హేళనగా మాట్లాడారు. దీంతో తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. వీరాంజనేయులు స్వయంగా టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట
వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.