ఈనెల 24న తాడిపత్రి మండలంలోని ఇగుడూరు గ్రామంలో చోరి జరిగిన రెండిళ్లను శనివారం డీఎస్పీ రామకృష్ణుడు పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు నారాయణ స్వామి యాదవ్, సూర్య నారాయణ యాదవ్ ఇంటిలోకి వెళ్లి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను డీఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.