భయం గుప్పిట్లో బీసీ హాస్టల్ విద్యార్థులు

67చూసినవారు
భయం గుప్పిట్లో బీసీ హాస్టల్ విద్యార్థులు
ఉరవకొండ పట్టణం బీసీ హాస్టల్ విద్యార్థులు భయం గుప్పెట్లో చదువులు కొనసాగిస్తున్నారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న హాస్టల్లో గదుల్లో పెచ్చులు ఊడుతున్న వార్డెన్ పట్టించుకోకపోవడం లేదని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశవ నాయక్ ఆరోపించారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కేశవ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రిస్తున్న గదులలో విద్యార్థులు మీద పెచ్చులు పడి గాయాలు పాలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్