పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల అందజేత

80చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల అందజేత
దసరా పండుగ సందర్భంగా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆసుపత్రి కమిటీ సభ్యుడు మిడతల చంద్రమౌళి శుక్రవారం నిత్యవసర సరుకులు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు సరిగ్గా అందక ఇబ్బందులు పడుతుండడంతో వారికి సరుకులు అందజేశారు. ప్రతి సంవత్సరం తాను పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు గంగాధర పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్