ఉరవకొండ మండలం పెన్నాహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీవారి పల్లకి ఉత్సవం కార్యక్రమం శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి శోభయమానంగా తీర్చిదిద్దిన పల్లకిలో కొలవుదీర్చి ఆలయం చుట్టూ ప్రదక్షణ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో విజయ్ కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.