పాఠశాలలకు కంప్యూటర్లు ప్రింటర్లను ప్రభుత్వం అందించాలి

67చూసినవారు
పాఠశాలలకు కంప్యూటర్లు ప్రింటర్లను ప్రభుత్వం అందించాలి
ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు ప్రింటర్లను తక్షణమే ప్రభుత్వం అందించాలని పొందూరు మండలం తాడివలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, DTF జిల్లా అధ్యక్షులు పూజారి హరి ప్రసన్న, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు అన్నారు. విద్యార్థుల ఆన్లైన్ అప్లికేషన్లు, నామినల్ రోల్స్ తదితర వాటి తయారీకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం గ్రాంట్స్ విడుదల చేయడం లేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్