పాఠశాల విద్యాశాఖ,ఏపి నేషనల్ గ్రీన్ కోర్ ఆదేశాల మేరకు బుడుమూరు ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 4న పర్యావరణం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుడుమూరు, అదపాక, మురపాక, తామాడ పాఠశాలల నుండి 8, 9 తరగతులు చదువుతున్న
విద్యార్థులు హాజరయ్యారు. నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్ గోవిందరావు, పర్యావరణవేత్త కూన రామం, ప్రధానోపాధ్యాయులు ఎస్. కె. ప్రసాదరావు, జెపర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.