ఇచ్చాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

58చూసినవారు
ఇచ్చాపురంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు
ఇచ్చాపురం పట్టణంలో మునిసిపల్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిమిత్తం శిబిరం ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా స్థానిక హాస్పిటల్ రహదారిలో ఉన్న గ్రంథాలయం వద్ద శిబిరాన్ని నిర్వహించారు. స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కార్మికులంతా ఆరోగ్యంగా ఉన్ననాడే పారిశుధ్యం మెరుగుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్