గాయపడ్డ వైసీపీ యువ కార్యకర్త ప్రసాద్ మృతి

53చూసినవారు
గాయపడ్డ వైసీపీ యువ కార్యకర్త ప్రసాద్ మృతి
ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి ప్రధాన అనుచరుడు ఫరీదుపేట గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కూన ప్రసాద్ ను అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో మృతి చెందారు. ఆదివారం రాత్రి కూన ప్రసాద్ రామ చెరువు వైపు వెళ్తుండగా గ్రామానికి సమీప దాబాలో టీడీపీ కార్యకర్తలు బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసుకొని వస్తున్నారు. ప్రసాద్ వారి కంట పడటంతో టీడీపీ కార్యకర్తలు వెంట పడి తరిమారు. ప్రాణ భయం తో ప్రసాద్ బైక్ పై నుండి దిగి పారిపోయి ఒక డాబా టెర్రస్ పై దాక్కొగా టీడీపీ కార్యకర్తలు వెంబడిస్తూ డాబా టెర్రస్ పైకి వెళ్లి విచక్షణ రహితంగా కర్రలతో ప్రసాద్ తలపై బలంగా కొట్టగా స్పృహ తప్పిపడిపోయాడు. అనంతరం బంధువులు సమాచారం తెలుసుకొని తొలుత శ్రీకాకుళం హాస్పిటల్ కి ఆ తరువాత విశాఖపట్నం కేజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. వైసీపీ నాయకులు నివాళులు అర్పించిన అనంతరం శనివారం దహన సంస్కరణలు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్