ప్రజలకు సేవలు అందిస్తూ మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందింది

84చూసినవారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం గా గుర్తింపబడిందని ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు అన్నారు. రణస్థలం మండలం జేఆర్ పురం గ్రామంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల ప్రజలకు మేలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్