ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

83చూసినవారు
కంచిలి మండలంలోని ఎక్కల ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం హెచ్ఎం బి. గిరి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఎంఈవో ఎస్ శివరాంప్రసాద్, డీజీ పురం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రమేష్ లను దుశ్శాలువలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సత్కరించారు. పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్ పర్సన్ జీరు లలిత, స్థానిక సర్పంచ్ రంగాల గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్