వేటకు వెళ్లి గుండె నొప్పితో మృతి

9610చూసినవారు
వేటకు వెళ్లి గుండె నొప్పితో మృతి
సోంపేట మండలంలోని ఇసుకల పాలెం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇసుకల పాలెం గ్రామానికి చెందిన పుక్కల్ల ధర్మారావు (65) సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి వస్తుండగా ఒక్కసారిగా గుండె నొప్పితో కూలిపోయాడు. ఒడ్డుకు చేరుకునేసరికి ఆయన మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్