మే 17 నుంచి 20వ తేదీ వరకు టెక్కలి మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహనరావు తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ శిక్షణ తరగతులకు సంబంధించిన పోస్టర్లను సోమవారం శ్రీకాకుళం ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ. ఈ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు.