టెక్కలిలో వడదెబ్బకు ఒక వ్యక్తి మృతి

2992చూసినవారు
టెక్కలిలో వడదెబ్బకు ఒక వ్యక్తి మృతి
టెక్కలి మండలం బన్నువాడ గ్రామానికి చెందిన పోలాకి రామారావు(70) అనే వృద్ధుడు మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. గ్రామంలో పొలంకి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరణ చేశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్