టెక్కలిలో యుటిఎఫ్ ఉపాధ్యాయులు నిరసన

57చూసినవారు
మండల కేంద్రం టెక్కలి లో రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్ తీసుకొస్తూ జారీచేసిన జీవో రద్దు చేయాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆదివారం నిరసన తెలిపారు. జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఎన్నికల్లో సిపిఎస్ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నూతన ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను తూట్లు పొడిచిందన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు కురమాన దాలయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు గణపతి రావు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్