ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సాయంత్రం విజయవాడ రాజ్ భవన్కు వెళ్లిన సునీత.. తన తండ్రి హత్యకేసుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వివేకాను అతి కిరాతంగా హత్య చేశారని, ఈ కేసులో తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.