ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ)కు చెందిన మాజీ గిరిజన ఎంపీ ప్రదీప్ మాఝీ, సుశ్రీ సంగీత సాహో అనే బ్రాహ్మణ మహిళను వివాహం చేసుకున్నారు. అయితే గిరిజన సంప్రదాయం ప్రకారం గిరిజనేతర ప్రజలు అగ్రకులాల మహిళను పెళ్లి చేసుకోవడం నేరంగా భావించి తెగ పెద్దలు.. ప్రదీప్ మఝీని, ఆయన కుటుంబాన్ని బహిష్కరించారు. ఈ తీర్పు ప్రకారం మాఝీతో పాటు ఆయన కుటుంబం 12 ఏళ్లు భటర సమాజంలో పాల్గొనడానికి వీలులేదు.