బడిశాలోని ప్రముఖ పూరీ బీచ్కు చనిపోయిన జెల్లీ ఫిష్లు పెద్ద సంఖ్యలో కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో పూరీ బీచ్ను శుభ్రం చేయాలని, పరిశుభ్రతను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే జెల్లీ ఫిష్లు భారీగా మృతి చెందడంతో పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.