టీడీపీ-జనసేన అడ్రస్ గల్లంతే: జోగి రమేష్
By dwarak 75చూసినవారుటీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్పై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. "ఇద్దరు మోసగాళ్లు వెళ్లి ఢిల్లీ పార్టీ(బీజేపీ)తో కలిశారు. విలువలు, విశ్వసనీయత వదిలేసి పొత్తులు పెట్టుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ-జనసేన అడ్రస్ గల్లంతే. చంద్రబాబును జనం నమ్మే పరిస్థితిలో లేరు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోతున్నారు." అని మంత్రి జోస్యం చెప్పారు.