ప్రభుత్వ స్కూల్లో రేషన్ బియ్యం బస్తాలు దించొద్దని, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పిన టీచర్పై టీడీపీ నేత బూతులతో రెచ్చిపోయాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కోర్నపల్లెలో జరిగింది. ‘ఎవడు ఎంఈవో.. లోఫర్ నా కొడకా.. మాకు 164 సీట్లు వచ్చాయి. మర్యాద నేర్చుకో నువ్వు. స్టోర్ బియ్యం బడిలో దించుతాం. ఇక్కడ ఉండకపోతే వెళ్లిపో.’ అని టీడీపీ నేత, డీలర్ విజయ్ భాస్కర్ టీచర్ను హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.