పోతుల సునీతకు టీడీపీ రెడ్ సిగ్నల్..?

69చూసినవారు
పోతుల సునీతకు టీడీపీ రెడ్ సిగ్నల్..?
ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పోతుల సునీత టీడీపీతో రాజకీయం మొదలెట్టారు. ఆ పార్టీ ద్వారా 2014లో టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీలో చేరిపోయారు. అయితే తాజా ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో వైసీపీకి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవిని సైతం వదులుకుని టీడీపీవైపు రావాలనుకుంటున్నారు. అయితే ఆమెను పార్టీలోకి తీసుకోవద్దని శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ఉన్న టీడీపీ నేతలు అంతా సీఎం చంద్ర‌బాబును గట్టిగా డిమాండ్ చేస్తున్నారని స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్