AP: ఇది తన మాట తన సొంత ఆలోచన అభిప్రాయం అంటూ మంత్రి నారా లోకేష్ విశాఖలో చేసిన ప్రకటన టీడీపీలో ఇపుడు చర్చకు దారి తీస్తోంది. పార్టీలో అందరికీ పదవులు రావాలని లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. లోకేష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే పార్టీలో చాలా మార్పులకు ఇది నాంది పలకబోతోందని అంటున్నారు. టీడీపీలోని సీనియర్ నేతలకు రెస్ట్ ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.