అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ క్రమంలో తమ కుటుంబాలకు న్యాయం చేయాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తూ.. పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసనకారులు పోలీసు స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసు స్టేషన్ గేట్లను పోలీసులు మూసివేశారు. గేట్లు ధ్వంసం చేసి లోనికి వెళ్లేందుకు ఆందోళనకారుల యత్నించారు.