AP: వైసీపీ నేతలు డబ్బు ఆశ చూపి ముందుగానే ఓటర్ల చేతి వేలికి సిరా చుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న జనసేన నేత నాగబాబు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. "ఆ సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. ఒక సమాచారం షేర్ చేస్తున్నప్పుడు కచ్చితమైనదా కాదా అన్నది ముందే నిర్ధారించుకోండి. నిజాలను పోస్ట్ చేయండి." అని ఈసీ వెల్లడించింది.