శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. "రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన రాముని పాలన. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతోంది. ఏపీ ప్రజలకు రామరాజ్యం నాటి పాలన అందిరావాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు." అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.