ఏపీ సీఎం జగన్పై రాయితో దాడి జరగడంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అయితే నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు రూ.2 లక్షల ఆఫర్ ప్రకటించారు. దీనిపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. సీఎం జగన్పై దాడి చేసింది ముమ్మాటికి ఆత్మలేనని ఆయన చెప్పారు. జగన్ అరాచకాలకు బలైన వ్యక్తులే ఆత్మలుగా వచ్చి దాడికి పాల్పడ్డారని చెప్పారు.