నర్సును దారుణంగా చంపిన భర్త

592చూసినవారు
నర్సును దారుణంగా చంపిన భర్త
యూపీలోని ఆగ్రాలో ఓ నర్సును ఆమె భర్త దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. గోవింద్ మోతీ, మంజు గోలా భార్యాభర్తలు. వారికి ముగ్గురు పిల్లలు. మంజు నర్సుగా పని చేస్తోంది. ఆమెకు మరో వ్యక్తి వివాహేతర సంబంధం ఉందని గోవింద్ అనుమానించేవాడు. మంగళవారం తెల్లవారుజామున మంజును గోవింద్ కనికరం లేకుండా కొట్టాడు. కత్తితో పొడిచి ఆమెను చంపాడు. రాత్రంతా మృతదేహం పక్కనే పడుకున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్