ఓటమి ఖాయమని తెలిశాకే హింసకు పాల్పడుతున్నారు: వర్ల రామయ్య

71చూసినవారు
ఓటమి ఖాయమని తెలిశాకే హింసకు పాల్పడుతున్నారు: వర్ల రామయ్య
ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమని తెలిశాకే హింసకు పాల్పడుతున్నారని వర్ల రామయ్య అన్నారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయాలని చెప్పారు. పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్రలు, కత్తులు, పెట్రో బాంబులు పెట్టుకోవడమేంటి? అని ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అనే అనుమానం కలుగుతోందన్నారు. పోలింగ్ శాతం పెరిగేసరికి జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్