పడవలు పంపించి ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలని చూశారు: సీఎం చంద్రబాబు (వీడియో)

54చూసినవారు
విజయవాడలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ "ప్రకాశం బ్యారేజీపైకి 3 పడవలను పంపించి దాన్ని కూల్చేయాలని చూశారు. ఒక్కొక్కటి 30 టన్నులు బరువు ఉన్న 3 ఇనుప పడవలు బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. అదే కాలువను గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజీనే కొట్టుకుపోయేది. ఆ 3 పడవలపై వైసీపీ రంగులు ఉన్నాయి. వీళ్ళకి పడవలు ఉంటే వాటిని లాంగరు వేసి కట్టేసుకోవాలి. కానీ అలా చేయలేదు. అదృష్టవశాత్తు వాళ్లు అనుకున్నది జరగలేదు." అంటూ వైసీపీపై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్