ముంబైలో రూ.20 కోట్లకు కొన్న బంగ్లాను రూ.32 కోట్లకు అమ్మేసిన నటి కంగనా రనౌత్

55చూసినవారు
ముంబైలో రూ.20 కోట్లకు కొన్న బంగ్లాను రూ.32 కోట్లకు అమ్మేసిన నటి కంగనా రనౌత్
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ముంబై బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న తన బంగ్లాను ₹32 కోట్లకు విక్రయించారు. రూ.40 కోట్లకు అమ్మకానికి ఉంచిన ఆ ఆస్తిని.. ఈ ధరకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా తెలిసిందని నివేదికలు తెలిపాయి. కాగా, ఈ బంగ్లాను కంగనా 2017 లో రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దీనిలో కొంత భాగం అక్రమ నిర్మాణమంటూ 2020లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బంగ్లాను పాక్షికంగా కూల్చివేశారు.

సంబంధిత పోస్ట్