ఏపీ ఎగ్జిట్ పోల్స్పై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. తమకు 20కి పైగా లోక్సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయా పోల్స్ ఏజెన్సీలు అనుసరించే శాస్త్రీయ విధానాల్లో లోపాల వల్ల ఓటర్లను అంచనా వేయడంలో పొరబడి ఉండొచ్చని అన్నారు. తమకు బలమైన నమ్మకం ఉందని, వైసీపీ గెలుపు ఖాయమన్నారు.