AP: కృష్ణ జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముగ్గురు నిందితులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు A27 శివ కుమార్, A28 ఆదిలక్ష్మి, A54 ప్రవీణ్ లను పోలిసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.