అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం

81చూసినవారు
తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లె పంచాయతీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు. రూ. 60లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు సర్పంచ్ బొల్లినేని సుభాషిణి, కాంట్రాక్టర్ శుభగిరి నాయుడు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఇప్పటికే రూ. కోటి వెచ్చించి యుడీఎస్ పనులను పూర్తి చేశామని, రూ. 60లక్షలతో చెర్లోపల్లెలోని అన్ని వీధులకు యూడీఎస్ పనులు చేపట్టినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్