305 మొబైల్ ఫోన్ లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ

65చూసినవారు
305 మొబైల్ ఫోన్ లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ
ఆదివారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్‌లో జరిగిన మొబైల్ రికవరీ మేళాలో 66 లక్షల విలువైన 305 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. కొత్త జీవనశైలిలో మొబైల్ ఫోన్ల అవసరం పెరిగింది, అందుచేత పోగొట్టుకున్న వారి బాధ వర్ణనాతీతం. చిత్తూరు పోలీసుల "చాట్ బాట్" సేవలు ద్వారా ఎఫ్.ఐ.ఆర్. లేకుండా కూడా మొబైల్ రికవరీ సాధ్యమని ఆయన తెలిపారు. రికవరీ చేసిన పోలీసులకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్