5 మంది పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు: సీఐ

52చూసినవారు
5 మంది పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు: సీఐ
వసంత్ అనే యువకుడిపైన రాడ్డు, కర్రలతో దాడి చేసిన 5 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ నెత్తి కంటయ్య శనివారం తెలిపారు. వసంత్ బంధువులతో కలిసి చర్చి వీధిలో వస్తుండగా వెనుక నుంచి అరుణ్ బైక్ తో ఢీకొట్టాడు. ఇద్దరు ఘర్షణ పడ్డారు. కక్ష పెంచుకొని అరుణ్, యశ్వంత్, గిరీష్, జయరాం, చిట్టిబాబులతో కలిసి సంతపేట లిల్లి బ్రిడ్జి వద్ద వసంత్ ను చావబాదారు. దీనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసామన్నారు.

సంబంధిత పోస్ట్