ఎన్డీయే ఎంపీ అభ్యర్థి చెన్నూరులో సుడిగాలి పర్యటన

76చూసినవారు
తిరుపతి ఎన్డీయే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు చెన్నూరులో శుక్రవారం రాత్రి సుడిగాలి పర్యటన చేశారు. తొలుత దళితవాడలోని మాతమ్మగుడిలో పూజలు నిర్వహించారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో చెన్నకేశవస్వామి ఆలయం వద్ద మహిళలతో మాట్లాడారు. సీఎం జగన్ దళిత కాలనీల అభివృద్ధికి నిధులివ్వలేదన్నారు. ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట బీజేపీ, టీడీపీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్