కమ్మవారిపాలెంలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

61చూసినవారు
కమ్మవారిపాలెంలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం
చిల్లకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో విజన్ ఆంధ్ర 2047లో భాగంగా ఉపాధి హామీ నిధులతో పల్లె పండుగ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో సీసీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పచ్చ వెంకటేశ్వర్లు నాయుడు, వేమసాని గజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్