కాణిపాకంలో సోమవారం నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్ పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో బాలాలయ మహోత్సవం నిర్వహించారు. ఈ వసంత పంచమి రోజున సరస్వతి యాగం నిర్వహించి పూజ ఫలాన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు పెన్నలు, ప్యాడ్లు, పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.