సత్యవేడు నియోజకవర్గంలోని టిటిడి ఆలయాల అభివృద్ధికి అన్నీ విధాలుగా సహకరించాలని టిటిడి జేఇఓ వెంకయ్య చౌదరిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు.సోమవారం తిరుమలలోని టిటిడి కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకొని వినతి పత్రాన్ని జేఈఓ కు అందించారు. త్వరలో సత్యవేడులో నూతన టిటిడి కళ్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నామని అందుకు తప్పక హాజరు కావాలని జేఈఓ ఎమ్మెల్యే ఆహ్వానించారు.